బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నాడు నిర్వహించిన తై బజార్ వేలం పాటలో మేకల సంత వాయిదా పడినట్లు స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో కమలాకర్ తెలిపారు. మేకల సంతకు సరైన ధర రాకపోవడంతో వచ్చే శనివారం రోజు నిర్వహిస్తామని ఎంపీడీవో తెలిపారు. వీక్లీ మార్కెట్ రోజు జరిగే సంత, పశువుల సంత వేలంపాటలో రామ గౌడ్, హరీష్ కుమార్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బలరాం, బిల్ కలెక్టర్ కిష్టారెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.