Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 1:53 pm Posted by : ramakrishna

జన, కుల గణన చారిత్రక నిర్ణయం

నిజామాబాద్, బతుకమ్మ: జన గణనతోపాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చారిత్రక నిర్ణయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాటాలడుతూ.. కేంద్రం చేపట్టనున్న జన, కులగణనతో దేశంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశమంతటా కులగణన చేపట్టలేని ప్రశ్నించారు. తెలంగాణాలో నిర్వహించిన కులగణన చెత్త బుట్టలో వేయడానికే ఉపయోగ పడుతుందని, కాంగ్రెస్ నాయకులే దాన్ని తగలబెట్టారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు,కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Population and caste census is a historic decision