Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 6:36 pm Posted by : ramakrishna

పాలిసెట్ ప్రశాంతం

హైద్రాబాద్, బతుకమ్మ: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీ సెట్)-2025 ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక కళాశాలలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లోమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉధ్యానవన, వెటర్నరి డిప్లోమా కోర్సులలో ప్రశేశానికి మంగళవారం పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మద్యహ్నం 1.30  వరకు 276 పరీక్షా కేంద్రాలలో పాలిసెట్ జరిగింది. 106716 మంది విద్యార్ధులకు గాను 98858 మంది హాజరయ్యారు. హజరు శాతం 92.64 శాతంగా నమొదైందని ఎస్ బిటిఇటి తెలంగాణ కార్యదర్శి పుల్లయ్య తెలిపారు.