నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హతమైన పోలీస్ అమరవీరుడు ప్రమోద్ కుటుంబాన్ని తెలంగాణ బీ సీ సంక్షేమ సంఘం నేతలు శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా బీసీ గౌరవ అధ్యక్షులు కోయడి నర్సంహులు గౌడ్, అధ్యక్షులు రమణ గౌడ్, రాష్ట్ర నాయకులు దాసరి మూర్తిలు ప్రమోద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీరితో పాటు బీసీ సంఘ నాయకులు నారాగౌడ్, మహిళా అధ్యక్షురాలు గైనీకాడి విజయ లక్ష్మి, నరేష్ లు పాల్గొన్నారు.