బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితతోపాటు నాయకులు ‘జై భీమ్’ నినాదాలు చేస్తూ అక్కడే కూర్చుని నిరసన తెలిపారు. దీంతో కవితతోపాటు కొంత మంది నాయకులను పోలీసులు అనుమతించడంతో వారు వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.