కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో పోలీసులు పేకాట స్థావరాలపై ఆదివారం దాడు నిర్వహించారు. నాగిరెడ్డిపేట్ మండలంలో నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3220 నగడు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. మద్నూర్ మండలంలో 7గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2300 నగదు, 6 సెల్ ఫొన్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద కొడప్ గల్ మండలంలో 5గురిని అరెస్ట్ చేసి రూ.4190 నగదు, 5ఫోన్లు, ఎల్లారెడ్డి మండలంలో నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3200 నగదు, 9బైకులు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
