Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 1:17 pm Posted by : ramakrishna

 వ్యవసాయ క్షేత్రం పోలీసుల దాడి

 

. . . 400 గంజాయి మొక్కల స్వాధీనం

. . . ముగ్గురు రైతులపై కేసు

గాంధారి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లాలో అటవీ శివారు ప్రాంతంలో సాగు చేస్తున్న మొక్కల క్షేత్రంపై పోలీసులు దాడి నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో విశ్వసనీయ సమాచారం మేరకు గాంధారి శివారులో మండల కేంద్రానికి చెందిన రైతు వ్యవసాయ పొలంలో సాగు చేస్తున్న గంజాయిని గుర్తించారు. శుక్రవారం గాంధారి పోలీసులు పత్తి పంటలో అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించారు. సుమారు 400 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రైతులపై ఎన్ డీపీఎస్ యాక్ కింద కేసు నమోదు చేశారు.