Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 August 2024, 7:24 pm Posted by : ramakrishna

మట్కా స్తావరం పై పోలీసుల మెరుపు దాడి

  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బతుకమ్మ, నిజామాబాద్ ్రకైం : వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని వన్ టౌన్ పరిధిలో మిర్చి కాంపౌండ్ లోని ఆన్లైన్ లో మట్కా నిర్వహిస్తున్న ముఠా పై పోలీసులు మంగళవారం సాయంత్రం మెరుపు దాడి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు. తమకు పట్టుబడ్డ వారిలో నిందితులు మొహమ్మద్ ముజాహిద్, షేక్ హమీద్, షేక్ నాజర్ అను వ్యక్తులను టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం ఆధ్వర్యంలో వారి బృందం మట్కా రాయుళ్లపై దాడి చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 29,690 నగదు తోపాటు 3 మొబైల్స్ ని స్వాధీన పరచుకున్నారని తెలిపారు. అనంతరం వారిని వన్ టౌన్ కు తరలించినట్లు తెలిపారు.