డిల్లీలో పోలీసులు ముమ్మర తనిఖీలు

డిల్లీ, బతుకమ్మ : పేలుడు ఘటన నేపథ్యంలో డిల్లీలో బుధవారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నగరంలోకి ప్రవేశించే ప్రధాన రోడ్లపై వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. జిల్లా యూనిట్లు, ప్రత్యేక విభాగాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పర్యాటక ప్రదేశాలు, మాల్స్ ప్రార్థన మందిరాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని చెబుతున్నారు. మరో వైపు ఇంటెలిజెన్స్ బ్యూరో, పారామిలిటరీ దళాలతో డిల్లీ పోలీసులు సమావేశాలు చేపట్టారు.