Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 1:33 pm Posted by : ramakrishna

ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించిన పోలీసు కమిషనర్

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. శుక్రవారం అర్ధరాత్రి మైనారిటీ ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించారు.  రాత్రి వేళ యువకులు అనవసరంగా వీధుల్లో నిలబడి ఉండగా, కమిషనర్ ఆపి వారి మొబైల్‌లను తనిఖీ చేశారు. చట్టవిరుద్ధంగా తిరుగుతున్నట్లు కనిపిస్తే, వారిని హెచ్చరించి, వారి మొబైల్ లేదా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రివేళ నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచిన దుకాణాలు హోటల్స్ వివరాలను సేకరించారు. అర్ధరాత్రి పోలీసు కమిషనర్ తనిఖీల సందర్భంగా నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న దుకాణాలు హోటళ్ల నిర్వాహకులపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసుల నమోదుకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.