బోనాల వేడుకల్లో పోచారం
. . . అమ్మవారికి ప్రత్యేక పూజలు బాన్సువాడ, బతుకమ్మ : ఆషాఢమాసం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల మహోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ జియాగూడ సబ్జీ మండి మహంకాళి ఆలయ...