బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో మరోక ప్రముఖ అభరణాల సంస్థ కాలుపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న పీఎంజే జువెల్స్ ఇందూరులో తన శాఖను తెరవనుంది. నగరంలోని హైదరాబాద్ లో గల ప్రముఖ ఆభరణాల సంస్థ పీఎంజే జ్యూవెల్స్ షోరూంను ఈనెల 18న(శనివారం) ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. పీఎంజే జ్యూయలరీస్ తెలంగాణ హెడ్ మహేశ్వరం మదన్ కుమార్, స్టోర్ హెడ్ వడ్ నాల కమల్ హాజరవుతారు.