’వేవ్స్‘ 2025 ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ముంబయి, బతుకమ్మ : అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మార్చాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ’వేవ్స్‘ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముంబయి వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న ఈ సమ్మిట్ ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడారు. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం నటీనటులు కళాకారులు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.