వేసవిలో మొక్కలు ఎండిపోకుండా చూడాలి
పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో సూచన... బాన్సువాడ, బతుకమ్మ : ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ సూచించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శులు సురేష్, శ్రీధర్ రెడ్డి, నాగరాజులకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం మండలంలోని రాంపూర్, రాంపూర్ తాండ, పులిపుర్చతాండ గ్రామాలలో ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామాల్లోని నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను ఆయన పరిశీలించారు. వేసవి కాలం నర్సరీలలో మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉందని, మొక్కలు ఎండిపోకుండా...