కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిల్
వెబ్ న్యూస్, బతుకమ్మ: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నాడు. అసెంబ్లీకి రానప్పుడు అనర్హుడిగా ప్రకటించాలని కోరాడు. ప్రస్తుతం ఈపిటిషన్ స్క్రుటినీ లో ఉంది.