హైదరాబాద్, బతుకమ్మ: దొంగల వద్ద రికవరీ చేసిన రూ.1.75 లక్షల ఫోను పోలీస్ డ్రైవర్ చోరీ చేశాడు. హైదరాబాద్ – మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద తన ఫోన్ పోయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకుని, ఫోన్ రికవరీ చేసి, లాకర్లో దాచిపెట్టారు. రూ.1.75 లక్షల ఫోన్ కావడంతో పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ దీన్ని చోరీ చేశారు. ఉన్నతాధికారులు శ్రవణ్ కుమార్ చోరీ చేశాడని నిర్ధారించి, అతన్ని రిమాండుకు తరలించారు.