ఆటోను ఢీకొన్న పెట్రోల్ ట్యాంకర్

ప్రయాణికులకు తీవ్ర గాయాలు   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని మజీద్ వద్ద  ఆదివారం హెచ్ పి పెట్రోల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్సులో బోధన్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.