Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 9:38 pm Posted by : ramakrishna

అంబేద్కర్ సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలో గతంలో నిర్మించిన అంబేద్కర్ భవనం శిథిలావస్థకు చేరుకుందని అట్టి భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి ఇందల్వాయి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పాశం చిన్న నర్సింలు ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పతాన్ని అందజేశారు. తక్షణమే ఎస్టిమేట్ చేయాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. సంఘ భవనాన్ని మరమ్మత్తులు చేయడానికి నిధులు మంజూరు చేస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పూజ్యం వీరయ్య, తుమ్మల నరేష్, జెగ్గ లక్ష్మణ్, కమ్మరీ నడిపి గంగారం తదితరులు పాల్గొన్నారు.