Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 9:08 am Posted by : ramakrishna

ప్రతిభా పురస్కారాలు అందుకున్న పెరుమాండ్ల ఆరాధ్య

 

మాక్లూర్, బతుకమ్మ:

మాక్లూర్ మండలం మాణిక్ బండార్ గ్రామానికి చెందిన పెరుమాండ్ల ఆరాధ్య మహాత్మ జ్యోతిబా పూలే ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ఇటివల బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి అత్యధిక మార్కులు సాధించిన టాపర్ లకు, ప్రధానోపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందచేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపి ఆర్ క్రిష్ణయ్య చేతుల మీదుగా మాణిక్ బండార్ జడ్పీ హైస్కూల్ ప్రదానోపాధ్యాయుడు సత్యనారాయణ, అదే పాఠశాలలో పదో తరగతి 556 మార్కులు సాధించిన ఆరాధ్యకు ప్రతిభా పురస్కారం అందుకున్నారు. వారికి గ్రామస్థులు, మండల విద్యాశాఖాధికారి శుభాకాంక్షలు తెలిపారు.

Perumandla Aaradhya, who received Pratibha Awards