డాబాలో మద్యం సిట్టింగ్ నిర్వహించిన వ్యక్తులను ఎమ్మార్వో ఎదుట బైండోవర్
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలో దాబాలో అక్రమంగా సిట్టింగ్ నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసి ఎమ్మార్వో వి.మారుతి ఎదుట బైండోవర్ చేసినట్టు జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. ఇకపైన దాబాలో ఎవరైనా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. దాబాలో భోజనం మాత్రమే అందించాలని మద్యం సిట్టింగ్ నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని జుక్కల్ ఎమ్మార్వో వి.మారుతి పేర్కొన్నారు.