Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 1:57 pm Posted by : ramakrishna

విష జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • గ్రామాల్లో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీలు చేసిన జిల్లా మలేరియా అధికారి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : వర్షాకాలం నేపథ్యంలో ప్రజలందరూ తమ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా మలేరియా అధికారి తుకారం రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు మోపాల్ మండలం మంచి గ్రామ అభివృద్ధి కమిటీ తో కలిసి గ్రామస్తులతో విష జ్వరాలు తదితర ఆరోగ్య సమస్యలపై సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబల్లి అవకాశం ఉన్నందున గ్రామాల్లో ఉన్న ప్రజలుతమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఏమాత్రం చిన్న జ్వరం ఒంటి నొప్పులు వచ్చిన సమీప ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లి అక్కడి వైద్యులను సంప్రదించి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూసుకోవాలన్నారు. చిన్న పార్టీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి పెద్ద ప్రమాదం ఏర్పడవచ్చు అని ఆయన ప్రజలకు సూచించారు.

జి జి హెచ్ లో మలేరియా ప్రత్యేక వార్డు ఏర్పాటు : 

అదేవిధంగా జిల్లావ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న మలేరియా, డెంగ్యూ విష జ్వరాల పట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మలేరియా వ్యాధిన పడే వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు జిల్లా మలేరియా అధికారి తుకారం రాథోడ్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

People should be alert about toxic fevers