ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సీపీ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రాబోయే 72 గంటలలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పొంగిపొర్లనున్న వాగులు, వంకలు వద్దకు వెళ్లవద్దు. జలాశయాలు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదు – ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. కావున అట్టి ప్రదేశాలకు ప్రజలు ఎవరు...