ఓటు వేయమని 10వ డివిజన్ ప్రజల నిరసన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయబోమని 10వ డివిజన్ ప్రజలు రోడ్డుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధికి నోచుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 10వ డివిజన్ ప్రజలు ఏకగ్రీవ తీర్మానానికి నడుం బిగించారు. సుమారు 300 నుంచి 400 మంది ఓటర్లు రోడ్డుపైకి ఎక్కి ఫ్లెక్సీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.