వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈనేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని వర్గాల అభ్యన్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల కలల సాకారానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోందని చెప్పారు. ఈసమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు.