హరియాణ గవర్నరర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ
పాల్గొన్న తెలంగాణ, ఏపీ సీఎంలు, ఇతర ప్రముఖులు
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో హరియాణ గవర్నరర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ’ప్రజలే నా ఆత్మకథ‘ పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డితో పాటు కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, పొంగులేటి, ఇతర నేతలు హాజరయ్యారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
