పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి
. . . పీడీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్.బాల్ రాజ్ బోధన్, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్.బాల్ రాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్లకు సంబంధించిన...