. . . పొలిసుల దాడిలో పట్టుబడిన తోమ్మిది మంది పెకాట రాయుళ్లు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పై నిర్వహిస్తున్న పెకాట స్థావరం పై పొలిసులు దాడి నిర్వహించారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ ఓకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి అధ్వర్యంలో పొలిసులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బిల్డింగ్ పై అంతస్తులో ఓక గధిలో పెకాట అడుతున్నరనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించారు. గత కోంత కాలంగా లక్ష్మారెడ్డి అనే వ్యక్తి జూదగాళ్లను ఓక్క చోట చెర్చి పెకాట అడిస్తున్న వైనం బట్టబయలైంది. పెకాట అడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని వారివద్ధ నుంచి రూ.40, 000 , సెల్ పోన్ లు స్వాధినం చేసుకున్నారు. పెకాట అడుతు పట్టుబడిన వారిలో చాల మంది రెగ్యూలర్ ప్లేయర్ లుగా గతంలో స్టార్ హోటల్ లలో జరిగిన పోలిసు దాడులలో పట్టుబడిన వారు ఉండటం గమనర్హం. రాత్రి వరకు కీలక సూత్రదారుల పేర్లు బయటకు రాకుండా ఉంచేందుకు పోలిస్ వర్గాలు సైతం వివరాలను బయటకు వెల్లడించకపొవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోందరిని తప్పించారని గుస గుసలు వినిపిస్తున్నాయి…