Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 7:28 pm Posted by : ramakrishna

పుల్కల్ గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సంతోష్ పటేల్, విజయ్ భాస్కర్ రెడ్డి తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభంతో రైతులకు తమ శనగ పంటకు సరైన కనీస మద్దతు ధర లభించే అవకాశం కలుగుతుంది. మధ్యవర్తుల సమస్య లేకుండా నేరుగా ప్రభుత్వానికి పంటను విక్రయించే సౌకర్యం రైతులకు అందుబాటులోకి వస్తుంది. దీంతో రైతులకు సమయానికి చెల్లింపులు జరగడంతో పాటు, ఆర్థిక భారం తగ్గి లాభాలు పెరుగుతాయి. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ పటేల్ రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విజయ్ భాస్కర్ రెడ్డి కూడా రైతుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానికులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.