పీడీఎస్ బియ్యం పట్టివేత

కామారెడ్డి, బతుకమ్మ : అక్రమంగా నిలువ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని కామారెడ్డి సిసిఎస్, టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది రైడ్ చేసి శుక్రవారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి పట్టనంలోని రాజీవ్ నగర్ కాలనీలోని ఒక ఇంటిపై దాడి చేసి డీసీఎం వాహనంలో నిలువ ఉంచిన 113 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడు షేక్ అర్బజ్ ను అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లై అధికారులు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.