నిజామాబాద్, బతుకమ్మ : అక్రమంగా నిలువ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్ప్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని అశోక్ నగర్ లో గల ఎరుకల వాడలోని పీడీఎస్ బియ్యం గోదాంపై దా చేసి 10టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4లక్షల వరకు ఉంటుందని తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం గోదాం నిర్వాహకున్ని వన్ టౌన్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు.