నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిలువ ఉంచిన పీడీఎస్ బియ్యాన్నిసోమవారం పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని వీక్లీ మార్కెట్ లోని శ్రీ సాయి కిరాణా షాప్ పై టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ సిబ్బంది ఆధ్వర్యంలో దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో 20క్వింటాల్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బియ్యం విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. దుకాణ యజమానికి తదుపరి చర్యల నిమిత్తం వన్ టౌన్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు.