పీడీఎస్ బియ్యం పట్టివేత
ఆర్మూర్, బతుకమ్మ : డీసీఎంలో తరలిస్తున్న 21 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. విజిలెన్స్ డిప్యుటీ తహసీల్దార్ వినోద్ పంచనామా నిర్వహించారు. డీసీఎం డ్రైవర్ జాకీర్, అన్వర్ రావూఫ్, మదనం ఎల్లయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.