శ్రీస్వామినాథ స్వామిని దర్శించుకున్న పవన్
తంజావూరు, బతుకమ్మ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఆయన తంజావూరులోని శ్రీస్వామినాథ స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పవన్ వెంట కుమారుడు అకీరా నందన్ ఉన్నారు.