12న పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం
మంగళగిరి, బతుకమ్మ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 12,13,14 తేదీల్లో కేరళ, తమిళనాడులలోని అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, పరుస రామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుతై సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు.