భిక్కనూర్, బతుకమ్మ: భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామానికి చెందిన పాత రాజు నియమితులయ్యారు. భిక్కనూరు మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్ గా పెద్ద మల్లారెడ్డికి చెందిన పాపనోళ్ల స్వామి, డైరెక్టర్లుగా తోట రమేశ్, కదిరే గోపాల్ రెడ్డి, పోగుల సాయిలు, బిక్కాజీ దిలీప్ కుమార్, లంబాడి భాస్కర్, కల్లూరి సిద్ధ రాములు, నాగర్తి రమేశ్ రెడ్డి, బాబుమియా, తాటికొండ మల్లేశం, బలుసుకుల మమత, కోడిప్యాక వెంకటేశం, ఎర్రం అమర్ ను నియమించారు. నూతన పాలకవర్గం రెండు సంవత్సరాలు కొనసాగనుంది. భిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇదివరకు అమృత రెడ్డి, బాణాల సువర్ణాఅమృతా రెడ్డి, శేఖర్, భగవంతు రెడ్డి, పట్లూరి హనుమంత్ రెడ్డి పనిచేశారు.