Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 9:07 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి ఆర్డిఓ గా పార్థసింహారెడ్డి బాధ్యతల స్వీకరణ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆర్డిఓ గా పార్థసింహారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు బాన్స్ వాడ ఆర్డీఓ కిరణ్ మై, కామారెడ్డి ఆర్డీవో ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఎల్లారెడ్డి ఆర్డీవో గా నారాయణపేట నుంచి పార్థసింహారెడ్డి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెవిన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.