Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 2:42 pm Posted by : ramakrishna

పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలోనే నయం చేయొచ్చు

  • యశోద హాస్పిటల్ వైద్యులు డా.బర్గోహైన్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్కిన్సన్ వ్యాధిని  తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డా.బర్గోహైన్ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిబిఎస్ ద్వారా రోగుల జీవితం మెరుగుపడుతుందన్నారు. పార్కిన్సన్ వ్యాధి అనేది ఒక ప్రగతిశీల మెదడు వ్యాధి అని ఇది లక్షలాదిమందిని ప్రభావితం చేస్తుందన్నారు. భారతదేశంలో పార్కిన్సన్ వ్యాధి యొక్క వ్యాప్తి  ప్రతి లక్ష జనాభాకు  15 నుండి 43 కేసుల మధ్య ఉంటుందని అంచనా వేశారు. జీవన దీర్ఘత్వం పెరుగుతుండడంతో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. డిబిఎస్ ద్వారా దీర్గకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులను అరికట్ట వచ్చాన్నారు. డిబిఎస్ మెదడులో రెండు వైపులా చికిత్స చేయగలదని, ఇది రెండు అవయవాలపై ప్రభావం చూపే రోగులకు లాభదాయకమన్నారు. ఈ సమావేశంలో వైద్యులు ప్రసాద్, రుక్మిణి పాల్గొన్నారు.