Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 4:39 pm Posted by : ramakrishna

రోడ్లపై గుంతలు పూడ్చిన పంచాయతీ సిబ్బంది

  • ’బతుకమ్మ‘ కథనానికి స్పందన

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మరణించాడు. దీంతో “ప్రాణాలు తోడేసిన రోడ్డు” అనే కథనం బతుకమ్మ దినపత్రికలో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పంచాయతీ సిబ్బంది రోడ్డుపై ఉన్న గుంతలను పూర్తిగా మూసివేసి మండల కేంద్రంలో గల రోడ్డును పూర్తిగా శుభ్రపరచారు. దీంతో పంచాయతీ సిబ్బందిని పలువురు ప్రశంసించగా మరికొందరు ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ గుసగుసలాడుతున్నారు.

Panchayat staff who filled the potholes on the roads