పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్, బతుకమ్మ : న్యూఢిల్లీలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా శుక్రవారం పల్లె గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డ్ నిజామాబాద్ జిల్లాకు కేటాయించడం సంతోషకరంగా ఉందని రైతులు తెలిపారు. అంతేకాకుండా పల్లె గంగారెడ్డి నిజామాబాద్ వారిని పసుపు బోర్డు చైర్మన్గా ప్రధానమంత్రి ఎంపిక చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.