బతుకమ్మ,బాల్కొండ:బాల్కొండ మండలం, వన్నెల్,బి గ్రామం నుండి కొత్తపల్లి రోడ్డు వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం బిటి రోడ్డు కొరకు రూ.100 లక్షలు మాజీ మంత్రి, బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయడం జరిగింది. బీటీ రోడ్డు పనులు పూర్తి అయినందున బుధవారం వన్నెల్, బి గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు కెసిఆర్, ప్రశాంత్ రెడ్డి చిత్ర పాటలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుక్కున్నారు. కార్యక్రమం లో సోసైటీ చైర్మన్ సూరజ్ రెడ్డి, బీఆర్ఎస్ వన్నెల్,బి గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ చారి, పన్నాల గంగారెడ్డి, రేంజర్ల సాయన్న, బాల్కొండ పార్టీ అధ్యక్షులు సిరికంటి సాగర్ యాదవ్, కన్న పోశేట్టి, ఫయాజ్ అలీ, ప్రసాద్ గౌడ్, ధర్మాయి రాజేందర్, సుభాష్, గడ్డం మహేష్, రాజా గంగారాం, బక్కూరి రాజేశ్వర్, కాల గంగారాం, ద్యావతి రవి, మగ్గిడి రాయదాసు, దేవేందర్, భూమేశ్వర్, కృష్ణ మూర్తి, సాయిరెడ్డి, చిన్న రెడ్డి, తెడ్డు చెక్రీ తదితరులు పాల్గొన్నారు.