- పాక్ ను కుప్పకూల్చిన స్పిన్నర్లు
వెబ్ డెస్క్, బతుకమ్మ : ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య దుబాయ్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ 19.1ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ 57(38), ఫకార్ జమాన్ 46(35) పరుగులు చేశారు. ఇండియా బౌలర్లు కుల్ దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, అక్షర్ పటేల్, భూమ్రా, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీసుకున్నారు. దీంతో భారత్ టార్గెట్ 20 ఓవర్లలో 147 పరుగులు చేయాల్సి ఉంది.