Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 2:38 pm Posted by : ramakrishna

ఉత్కంఠగా పద్మశాలీ సంఘం ఎన్నికలు

.రెండు ప్యానళ్ల హోరాహోరీ ప్రచారం

. విచ్చలవిడిగా ప్రలోభాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగర పద్మ శాలీ సంఘం ఎన్నికలు ఉత్కంఠంగా సాగుతున్నాయి. నగరంలోని సూర్య నగర్ పాఠశాలలో పోలింగ్ సాగుతోంది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనుంది. రెండు ప్యానళ్ల మధ్య పోటీ ఉత్కంగా సాగుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ గత నెల రోజులుగా ప్రచార పర్వాన్ని ఊపందించారు. నిజామాబాద్ నగరంలో 65 తర్పలకు గాను 5230 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల తరఫున ప్రచారం జోరందుకుంది.