మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ
నిజామాబాద్, బతుకమ్మ : మందకృష్ణ మాదిగను పద్మశ్రీ వరించింది. నిజామాబాద్ విచ్చేసిన మందకృష్ణ మాదిగ నిజామాబాద్ సభలో ఉండగానే ఈ శుభవార్త రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా శనివారం నిజామాబాద్ నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ లో ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించే వెయ్యి గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక కార్యక్రమానికి మాదిగ సోదరులు తరలిరావాలని పిలుపునిచ్చారు. నిజామాబాదులో ఉన్న మాదిగ సంఘాల తరఫున శుభాకాంక్షలు తెలిపారు.