Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 1:56 pm Posted by : ramakrishna

మదన్ మోహన్ కు మంత్రి పదవి ఇవ్వాలని పాదయాత్ర

గాంధారి, బతుకమ్మ: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు మంత్రి ఇవ్వాలని కోరుతూ మండల కాంగ్రెస్ నాయకులు గాంధారి భోగేశ్వరాలయం నుంచి బుగ్గ రామేశ్వర ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. విద్యావంతుడు, మేధావి, ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తున్న మదన్ మోహన్ కు మంత్రి పదవి ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసినవారవుతారన్నారు.