Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2024, 4:34 pm Posted by : ramakrishna

అనాధ మృతదేహానికి ఇందూరు యువత అంత్యక్రియలు 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత 5 రోజుల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందిన ఓ అనాధ మృతదేహానికి  జిల్లా కేంద్రానికి చెందిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ బుధవారం అంత్యక్రియలు చేశారు. తనకి ఐన వారు ఎవరు లేరని భిక్షాటన చేస్తూ ఉండేవాడిని పూర్తిగా ఆనారోగ్యం క్షీణించిపోయి మృతిచెందగా ఆ అనాధ శవానికి  అంత్యక్రియలు నిర్వహించమని 4వ ఠణా ఏస్.ఐ శ్రీకాంత్ కోరగా బుధవారం నగరంలోని
బాబాన్ సహబ్ పహడి వద్ద గల అసద్ బాబ నగర్ స్మశాన వాటికలో ముస్లిం మత సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ, జామాతే ఇస్లామి అలాగే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ 4వ ఠణా పోలిస్ సిబ్బంది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Orphan's body is cremated by the youth of Indore