నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ప్రధాన బస్ స్టేషన్ లో మార్వాడి యువ మంచ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ ఆనంద్ చలివేంద్రం ప్రారంభించారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు, సీఐ, స్టేషన్ మేనేజర్ కైలాష్ జి జైన్ పాల్గొన్నారు.
ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ..
కల్యాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంతోష్, అఖిల్, రాజ్ కుమార్, మురళి, కాలేవర్ సంజీవ్, శివ, హరి, గంగోని తేజ , అక్షయ్, యోగేష్, అనుష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
