బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం డోన్ పాల్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం ఐకెపి అధికారి తడకల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాములు, తాజా మాజీ సర్పంచ్ పర్స దేవన్న, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రమేష్, పర్స పెద్ద రాజన్న, శేఖర్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రవి కిషన్, ఐకెపి సీసీ రాజేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.