నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ వర్సిటీ ప్రధాన క్యాంపస్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సెమిస్టర్ (సీఎస్ఈ & ఏఐ) పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ తెలిపారు. రెండవ రోజైన గురువారం ఆయన పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. గురువారం జరిగిన పరీక్షకు 71 మంది విద్యార్థులకు గాను 71 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ తనిఖీలో పరీక్షల నియంత్రణ అధికారి కె. సంపత్ కుమార్ పాల్గొన్నారు.