Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 2:10 pm Posted by : ramakrishna

కొనసాగుతున్న బాపూజీ వచనాలయం కార్యవర్గం ఎన్నికలు

Ongoing Bapuji Vachanalayam Executive Committee Elections

. ఓటు హక్కు వినియోగించుకోనున్న 488 మంది ఓటర్లు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయం నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడిగా భక్తవత్సలం నాయుడు, రఫీక్  ఖాన్ పోటీలో ఉన్నారు. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారిని సభ్యులు ఎన్నుకోనున్నారు. ఎన్నికల అధికారిగా న్యాయవాది  ఎమ్మెస్ శ్రీహరి ఆచార్య, అదనపు అధికారులుగా  న్యాయవాదులు పులి జైపాల్, నారాయణ వ్యవహరిస్తున్నారు. సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోగా, మాజీ అధ్యక్షుడు భక్తవత్సలం నాయకుడు మరోసారి పోటీలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా రఫీక్ ఖాన్ బరిలో నిలిచారు. రాత్రి వరకు ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.

Ongoing Bapuji Vachanalayam Executive Committee Elections