Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 3:41 pm Posted by : ramakrishna

ట్రాక్టర్ ఢీ కొని ఒకరి దుర్మరణం

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణంలో ని చౌరస్తా దగ్గర ఇసుక లోడుతో వెళ్తున్న  ట్రాక్టర్ ఢీ కొని భిక్కనూరుకు  చెందిన నీల ఇస్తారి (56) మృతి చెందాడు. ఎస్సై తెలిపిన సమాచారం ప్రకారం నీల ఇస్తారి భిక్కనూరు చౌరస్తా నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో అటుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణం అయినా ట్రాక్టర్ డ్రైవర్ ను ఆగ్రహంతో స్థానికులు బంధువులు దాడికి దిగారు ఎస్ఐ సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.మృతిని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కు కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగిందని ఎస్సై తెలిపారు .